ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

బ్యాంకుల ద్వారా రైతు భరోసా పైకం రైతులకి ఇవ్వాలి* – *రైతుల అప్పు కింద జమ చేసుకోవద్దు* *డి.సి.ఎం.ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల*

📰 Generate e-Paper Clip

*మహిళా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా పైకాన్ని మహిళా సంఘాల అప్పులో బ్యాంకర్లు జమ చేయడాన్ని ఖండించిన కొత్వాల*
*కొత్వాల చొరవతో రైతు భరోసా పైకం పంపిణీ*

11 జులై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇన్చార్జ్ ఆలస్యం విరన్ . కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్న రైతు భరోసా పైకాన్ని రైతులకు అందజేయాలని *డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని మల్లారం గ్రామ మహిళా రైతుల స్వయం సహాయక గ్రూపుల్లోని ఖాతాల్లోకి *రైతు భరోసా పైకం* వేశారు. అట్టి రైతు భరోసా పైకాన్ని *బ్యాంకర్లు* *రైతుల అప్పు* క్రింద జమ చేసుకొని రైతులకు పైకం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని రైతులు *కొత్వాల* దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన *కొత్వాల* వెంటనే *ఎస్.బి.ఐ కిన్నెరసాని శాఖ మేనేజర్ వెంకటరెడ్డిని* కలసి బ్యాంకు సిబ్బందితో మాట్లాడి మహిళా రైతులకు రైతు భరోసా పైకాన్ని ఇప్పించారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం క్రింద ఒక ఎకరానికి *12 వేల రూపాయలు* పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నదని బ్యాంకర్లు వాటిని తమ బ్యాంక్ అప్పుల క్రింద జమ చేసుకోవడం సరికాదన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రైతు భరోసా పైకాన్ని సద్వినియోగం చేసుకోవాలని *కొత్వాల* అన్నారు.
*కొత్వాలకు మహిళా సంఘాల సభ్యులు ప్రశంసలు* :
రైతు భరోసా పైకాన్ని బ్యాంకులు ఇవ్వకపోవడంతో మహిళా రైతులు ఆందోళన చెంది విషయాన్ని *సొసైటీ చైర్మన్ కొత్వాల దృష్టికి* తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించి బ్యాంకర్లతో మాట్లాడి రైతు భరోసా పైకాన్ని ఇప్పించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను దృష్టికి తీసుకెళ్లగానే స్పందించిన *కొత్వాల చొరవ పట్ల మహిళా రైతులు హర్షం వ్యక్తం చేశారు కొత్వాలను ప్రశంసించారు* .
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం పరిధిలోని *మల్లారం గ్రామ మహిళా రైతులు, పాల్వంచ సొసైటీ డైరెక్టర్ బుడగం రామ్మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న, వై. వెంకటేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!