
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి,
,జూలై 18:
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర జూలై–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం బిక్కవోలు మండలంలో ఘన వ్యర్థాల నిర్వహణ, భారీ వ్యర్థ ఉత్పత్తిదారులు (బీడబ్ల్యూజీలు) అవగాహన కార్యక్రమం, అలాగే ఎస్ఏఎస్ఏ ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు బాధ్యతాధికారి ఎంపీడీవో వై. మునేశ్వరరావు, పరిపాలన అధికారి వి.ఎన్. ప్రసాద్, ఎన్డీఏ కూటమి నాయకులు ఓ.వి. కృష్ణారావు చౌదరి, గొర్ల త్రిమూర్తులు, బిక్కవోలు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి, మండల పరిషత్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు సూచించారు. అనంతరం అందరూ (ఎస్ఏఎస్ఏ) ప్రతిజ్ఞ చేశారు.

