అమ్మవారి బోనం ఎత్తుకుని భక్తి చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో కాళ్లకు చెప్పులు ధరించి ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సంప్రదాయాల ప్రకారం బోనం తీసుకెళ్లే సమయంలో భక్తులు పాదరక్షలు లేకుండా ఉండటం ఆనవాయితీగా భావిస్తారు. అయితే టీపీసీసీ చీఫ్ చెప్పులు ధరించే బోనం ఎత్తుకోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

