ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు – మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు – మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 08 2026: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ సైన్యం ప్రధానంగా ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు సమాచారం. అయితే, ఇరాన్ నుంచి ప్రయోగించిన పలు క్షిపణులను అమెరికా తన రక్షణ వ్యవస్థల సహాయంతో మార్గమధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్ దాడుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నట్లు, స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తమ క్షిపణి దాడులు జరిగాయని ఇరాన్ రాజధాని టెహ్రాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ చర్యలకు తగిన సమాధానం ఇవ్వడానికే ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొన్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!