ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

గొల్లలమామిడాడలో కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా దొరబాబు కృషితో బసివి రెడ్డి సేవలకు చిరస్మరణీయ గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే11:
    అపర దానకర్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహాన్ని గొల్లలమామిడాడ గ్రామంలో యువ నాయకుడు చింతా దొరబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బసివి రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
    సామాజిక సేవ, దాతృత్వం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో జీవించిన బసివి రెడ్డి చేసిన సేవలను నేటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దొరబాబు అవిరళంగా కృషి చేస్తున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. బసివి రెడ్డి జీవిత విశేషాలు, ఆయన చేసిన మంచి పనులు గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వారికి కూడా తెలిసేలా దొరబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
    ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఐదు తరాల అనంతరం కూడా బసివి రెడ్డి ఖ్యాతిని ప్రజల్లో నిలబెట్టడం సాధారణ విషయం కాదని, దొరబాబు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. బసివి రెడ్డి పేరు మరింతగా వ్యాప్తి చెందేలా కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
    గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బసివి రెడ్డి ఒక ప్రతీకగా నిలిచారని, అలాంటి మహనీయుడి జ్ఞాపకాలను తరతరాలకు అందించాలనే లక్ష్యంతో దొరబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
    బసివిరెడ్డి విగ్రహా ప్రతిష్టతో గ్రామ ప్రజలు దొరబాబు సేవాభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

 

 

Latest Articles

*ప్రజయ్ వాటర్ ఫ్రంట్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికే చెట్ల తొలగింపు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

పేట్రేగిపోతున్న ఎక్సైజ్ కమిషనర్ అవినీతి అక్రమాలు

– ప్రభుత్వ నిబంధనలకు పాతర కాసులుఇచ్చినవారికిపోస్టింగ్స్,గంజాయికేసులోనూకమీషనర్,నాటకాలు,కోటి రూపాయలిస్తే కోర్టును మోసంచేసిన వారిని...

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!