ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగ్రామాలలో మట్టి వినాయక విగ్రహలనే ఏర్పాటు చేసుకోవాలి

గ్రామాలలో మట్టి వినాయక విగ్రహలనే ఏర్పాటు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

వినాయక బృందాలకు అవగాహన కల్పించిన పెద్దమందడి ఎస్‌ఐపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని పెద్దమందడి ఎస్‌ఐ పి. జలంధర్ రెడ్డి సూచించారు. సోమవారం పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక బృందాల యువకులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యంతో పాటు పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు, జలచరాలకు ఎలాంటి హాని కలగకుండా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకునేలా యువత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించాలని ఆయన కోరారు. గ్రామాల్లోని వినాయక బృందాలు ఈ విషయంలో ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎస్‌ఐ జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ కానిస్టేబుల్ జగదీశ్వర్ వివిధ గ్రామాల వినాయక బృంద యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!