ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచదువు క్రమశిక్షణ దేశానికి రక్షణ కవచాలు

చదువు క్రమశిక్షణ దేశానికి రక్షణ కవచాలు

📰 Generate e-Paper Clip

 –  ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి,
– మాజి కురుమూర్తి దేవస్థానం  పాలకమండలి సభ్యులు,శిశుమందిరoమాజీప్రధానాచార్యులు,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య అదనపు ప్రధాన  కార్యదర్శి బాదం వెoకటేశ్వర్లు,             
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ 
సెప్టెంబర్.05.2026.విద్యతోపాటుక్రమశిక్షణసంస్కారంచాలాఅవసరమని అత్యున్నత విద్యార్హత విద్యార్థి భవిష్యత్తునుమారుస్తుందనిశ్రీశ్రీకురుమూర్తి,దేవస్థానంపాలకమండలి సభ్యులు,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి శిశు మందిర్ మాజీ  ప్రధానాచార్యులు బాదం వెంకటేశ్వర్లు శనివారంఒకప్రకటనలోతెలిపారు.ఉపాధ్యాయదినోత్సవంసందర్భంగాకొత్తకోటలోవిలేకరులతమాట్లాడుతూసంస్కారరాహీతమైనప్రభుత్వఉద్యోగిరహస్యంగా ఉంచాల్సినదేశరహస్యాలనువిదేశాలకుఅమ్మాడు.దేశంగురించినఆలోచనలేకతనకుటుంబసుఖాలకైస్వార్థంతోఇలాచేశాడు.దింతోసంస్కారందేశభక్తియొక్కఅవశ్యకతమనకువిధితమవుతున్నయి.అందుకచదువుక్రమశిక్షణదేశానికిరక్షణకవచాలనిఆయనఅన్నారు.2,దేశఅభివృద్ధికిమచిఉపాధ్యాయునిఆవశ్యకత,ఈరోజుల్లోతల్లిదండ్రులుతమసంతానముడాక్టర్లుగా,ఇంజనీర్లుగాఅవసరమనికొందరుఆలోచిస్తే,మరికొందరుమంచపరిపాలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్ బాధ్యతలతోఉండాలనిఆలోచిస్తున్నారు.దేశాభివృద్ధికిఈవృత్తిలేనాసరిపోయేది.మరిఇంకేమైనాఉపకరిస్తాయో ఆలోచిస్తే మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత మనకు స్వాతంత్రం వస్తుందని ఆశించినాము.ఒక విలేకరిమీకుస్వాతంత్రంవచ్చినతర్వతఏపదవినిచేపట్టగలరనితిలక్,నుఅడిగినాడు.అందుకుతిలక్,సమాధానంఇస్తూస్వతంత్రంకనుకవచ్చినట్లయితే”దక్కన్,ఎడ్యుకేషనల్,సొసైటీ”వారిచేనిర్వహింపబడేపాఠశాలలోగణితఉపాధ్యాయునిగాచేరగలనంటారు.పరిపాలనా భారము చేపట్టవచ్చు కదాఅన్న ప్రశ్నకు అనుభవజ్ఞులుఉన్నారు,పరిపాలకులనుతయారుచేసేదివిద్యాలయంలోగనుకవిద్యార్థులనురూపదిద్దగలనoటారు.దేశంలోస్థిగాతులుక్షీణిస్తున్న రోజుల్లో దేశ భవిష్యత్తునుబాగుపరిచేదివిద్యారంగమేకాబట్టిదేశాభివృద్ధికిమంచిఉపాధ్యాయుని ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అన్నారు.3,రాబోయేతరానికికావలసినవ్యక్తి గాతలనుతయారుచేయుబాధ్యతఆచార్యులదే,శక్తివిహీనమైన అసమర్థులైన వ్యక్తుల తయారీదారు కాదు నేటిసమాజానికికావాల్సింది.వ్యక్తిఅభిరుచినిపరిశీలించి వ్యక్తిని నిర్మాణం గావించాలి.తల్లి కబుర్లతో తన బిడ్డకుఅన్నంతినిపించిస్నానంచేయించిక్రమశిక్షణతో పెంచుతుంది. అలాగేఉపాధ్యాయుడురకరకాల విజ్ఞానకబుర్లతోవిద్యార్థులకుపరిజ్ఞానాన్నిఅందజేయాలి.నేడు అల్లరి పిల్లవాని చూసి ఏ కన్నతల్లి బిడ్డా రా నీవు అనడానికి బదులుగా వీడు ఎవరి విద్యార్థి అని సమాజం అంటున్నదని,4, మన జీవితానికి పాఠశాలే పునాది,మన జీవితానికి పునాదివేసేదిపాఠశాలలేనని విద్యావంతులుఎక్కడికివెళ్లినాపూజింపబడతారనితల్లిదండ్రులు క్రమశిక్షణ పాటిస్తూ తమ పిల్లలను అలవర్చాలని చీకటినుంచివెలుగులోకిమనజీవితానినడిపించేది కేవలం విద్యాయేనని పదవులు శాశ్వతం కాదు జీవితం విలువలేముఖ్యంవ్యక్తిగతగౌరవంపోoదేలాజీవతాన్నిమరిచిపోవాలిఉన్నతస్థానంలోఉన్నప్పుడేగురువులకునిజమైనసంతోషంఅన్నారు.విద్యతోనేగౌరవంక్రమశిక్షణవినయంవిజ్ఞానాన్ని,విధేయతలను,సంస్కారాన్నినేర్పించేదనిఅన్నారు.5,విద్యాద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందని,ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని శాస్త్ర సాంకేతికరంగాల్లోవస్తున్నమార్పులపైఎప్పటికప్పుడువిద్యార్థులుఅవగాహనపెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని సాధన దిశగా కృషి చేయాలని అన్నారు.6.దేశభక్తి విద్యార్థులలో ఏ విధంగా నిర్మాణం చేయాలని, జపాన్లో ప్రతి పౌరుడు దేశభక్తుడే.అవమానంగా తమ దేశాన్నిగూర్చిఎవరైనా మాట్లాడితే సహించరు.ఒకసారి “స్వామి రామతీర్థ” జపాన్,కువెళ్తాడు.మధ్యలోఒకస్టేషన్లోదిగిఅరటిపండ్లకై వెతుకుతాడు. అచట దొరకవు ఎదురుగా ఉన్న జపాన్ యువకుడు ఫలములను తెచ్చి ఇచ్చి స్వామి రామతీర్థ ఇచ్చు డబ్బులు తీసుకోకుండా జపాన్ దేశంలో ఫలములు దొరకవు అని మీ దేశంలో చెప్పవద్దంటాడు. ఇది ఆ దేశంలో పౌరులకున్న దేశ భక్తి7.ఉపాధ్యాయునిజవాబుదారితనం,పాఠశాలఅభివృద్ధికి,విద్యార్థులు,విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధచూపివిద్యార్థులకుఅర్థమయ్యేరీతిలోవిద్యనుబోధించాలనివిద్యార్థులవిషయంలోఉపాధ్యాయులకు జవాబు దారితనం పెరగాలన్నారు. కంప్యూటర్ యుగంలో పోటీ అనేది సహజమని విద్యార్థులు దానిని ఆరోగ్యకరంగా తీసుకొని ప్రతిభను చాటాలని అన్నారు. పోటీని ఎదుర్కోవాలని సాధనతో పాటు లక్ష్యంతో పాటు కృషి తోడైతే గమ్యాన్ని సులభంగా అందుకోవచ్చునన్నారు.
8.ఉపాధ్యాయులది మహోన్నతమైన బాధ్యత,     భారత పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులదే గొప్పనైన పాత్ర అని..చిన్నారులను తీర్చిదిద్దే కార్యాచరణ కార్యక్రమం ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ప్రారంభమై చివరకు వారు రాజకీయ పరిపాలన తదితర రంగాల్లో మానవీయ దృక్పథంతో విధులనునిర్వహించడంలోప్రతిఫలించాలి.ఎందరో విద్యార్థులురాజకీయాలలోసచివాలయాల్లో,విద్యారంగంలో,బ్యాంకులలో,ఇన్సూరెన్స్,కార్యాలయాల్లో ఇతర ఉపాధి రంగాల్లో ప్రాతినిథ్యం వహిస్తారు. ఒకవేళ వారు స్వార్ధపరులుగా మారినట్లయితే వారికి విలువలతో కూడిన విద్యా బోధించలేదని అర్థం. ఉపాధ్యాయులు ఒక సాధారణ ఉద్యోగుల కాకుండా బృహత్తరమైన జాతి నిర్మాణ బాధ్యతను నిర్వహిస్తున్నామని గుర్తించుకోవాలి.విద్యా మనిషిని మనిషిగా మారుస్తుంది. 9.క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలి, క్రమశిక్షణతో కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదని ప్రతి చిన్న విషయానికి కృంగిపోవద్దన్నారు.పాజిటివ్ థింకింగ్ తో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వృత్తిపరమైన ఇబ్బందులు అన్ని స్థాయిల్లో ఉంటాయని వాటిని అధిగమించడమే పనిగా పెట్టుకోకుండా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని* అన్నారు. 10.చదువు జీవితాన్ని మారుస్తుంది.  విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని చదివే జీవితాలను మారుస్తుందని.. విద్యార్థులు పట్టుదలతో చదువుతే భవిష్యత్తు ఉంటుందని ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పిల్లలకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందని టెక్నాలజీలో మనము స్ట్రాంగ్ గా ఉన్నామని అమెరికాలో ఉండే పిల్లల కంటే ఇండియాలోనిపిల్లలుఇంగ్లీషుబాగామాట్లాడుతున్నారని అన్నారు.విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ ఉంటుందనిభయపడటం వల్లఅప్పటివరకుచదివినఅంశాలనిమర్చిపోతారని, పరీక్షలను ఒక గేమ్ లా ఒక ఆటలాతీసుకోవాలని సబ్జెక్టును..అవగాహన చేసుకుని చదువుతే బాగా గుర్తుంటుందని, తల్లిదండ్రులు స్నేహితుల్లా మారాలని..చాలామంది తల్లిదండ్రులు ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిపెంచుతుంటారని.ఇది ఏమాత్రంశ్రేయస్కరంకాదనిమానసిక,శారీరక,విశ్రాంతి కల్పించాలని సమయానికి సరైన ఆహారం ఇవ్వడంతో పాటు ఇంట్లో వారికి ఏకాగ్రతకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూడాలని తోటి విద్యార్థులలో ఎట్టిపరిస్థితుల్లోనూపోల్చకూడదని, అన్నారు.11.పూర్వకాలంలో శిష్యుల వలన గురువుకు గౌరవం* లభించేది. పూర్వకాలంలో శిశువుల వలన గురువులకు గౌరవం లభించేదని అన్నారు.శ్రీరాముని వల్ల వశిష్టునికి,శ్రీకృష్ణుని వల్ల సాందిపునికి,శివాజీవల్లసమర్థరామదాసుకు,చంద్రగుప్తుని వల్ల చాణుక్యునికి, అదేవిధంగాఆచార్యుల ప్రవర్తన ఆదర్శప్రాయంగాఉండాలని.విద్యార్థులను పెడదారి పట్టించేదిగా ఉండరాదని,వ్యక్తితో సంస్కారం నింపేందుకు ప్రముఖ కారకుడు ఆచార్యుడని ఆ తర్వాత తల్లిదండ్రులు ఆచార్యుడు తన ప్రబోధం ద్వారా ప్రవర్తన ద్వారా  విద్యార్థులలోసుగుణసంపత్తినికలగజేయాలని,నీతి,నిజా  యితీ,దేశభక్తి,దైవభక్తి విద్యార్థులలో కలగజేయా  లని అన్నారు. అప్పుడే ఆచార్యుడు భావితరాలకు తీర్చిదిద్దే వ్యవస్థను రూపొందించిన వాడవుతాడని.. మనం ఒక  పవిత్రమైన వృత్తిలో ప్రవేశించినాము కనుక చక్కని భావాలను విద్యార్థులలో ప్రవేశపెట్టి సూయోగ్గులుగా    తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆచార్యులపై ఉన్నదని     చెప్పారు.12.ఉపాధ్యాయుని కి   చక్కటి గుర్తింపు సమాజాన్ని సరైన  పద్ధతిలో నడిపిం  చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై  ఉందన్నారు.ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయుల   పాత్ర చాలా కీలకమన్నారు.ఆచార్యుడుఅందరికీ,మార్గదర్శకంగా ప్రతిరోజు కొత్త విషయాలను తన తరగతి  గదిలోని విద్యార్థులకు బోధించాలన్నారు. విద్యార్థులను జాతీయ  భావాలను జోడించి దేశభక్తి వైపు మంచి ఆదర్శవంతమైన పౌరుడిగా సమాజానికి సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా నిర్మాణం చేయాలన్నారు.సమాజంలో మంచి సంబంధాలు కలిగి  ఉండడం ద్వారా చక్కటి గౌరవం గుర్తింపు ఉపాధ్యాయులకు లభిస్తుందని* అన్నారు.13.కేజీ టు పీజీ వరకు సైకాలజీ ఉండాలి, మారుతున్న కాలం మానసిక సమస్యలు కూడా అధికమవుతున్నాయని, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత విధిస్తున్నారని, తెలిసి తెలియక వయసులో అరాచకాలకు పాల్పడుతున్నారని ఇలాంటి  వాటిని అరికట్టేందుకు పిల్లల్లో మానసిక పరివర్తన పెంపొందించేందుకు కేజీ నుంచి పీజీ వరకు సైకాలజీ   అవగాహన కల్పించాలని అన్నారు. 15.ఉత్తమ   ఉపాధ్యాయులుగా    *ఉపాధ్యాయుల్లో సృజనాత్మకత..నమ్మకము పరస్పర సహకారంతో పనిచేసే అలవాటు ఉండేవారని..దీంతో  ఉత్తమ ఉపాధ్యాయులుగా మారడానికిఅవకాశంఉంటుందన్నారు.సమాజంలో విద్యార్థుల మార్పునకు ఉపాధ్యాయులు కారకులుగా మారాలన్నారు.సమాజంలో   అందరు గౌరవించే వృత్తులలో మొదటిది అధ్యాపక వృత్తికి న్యాయం చేసేందుకు నిత్యం కృషి అవసరమని* అన్నారు. 16.గురువులకు నిజమైన సంతోషం, ప్రతి ఒకరు బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై  ఎప్పటికప్పుడు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని సాధన దిశగా కృషి  చేయాలని..విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులకుజవాబుదారీతనంపెరగాలన్నారు.కంప్యూటర్ యుగంలో పోటీ అనేదిసహజమని విద్యార్థులు దానిఆరోగ్యకరంగాతీసుకొనిప్రతిఫలం చాటాలని..పోటీని ఎదుర్కోవాలని లక్ష్యంతో పాటు కృషి తోడైతే గమ్యాన్ని సులభంగా అందుకోవచ్చు  అన్నారు.వ్యక్తిగతగౌరవంపొందేలా జీవితాన్ని మలుచుకోవాలని..విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే   నిజమైన సంతోషమని          అన్నారు.17.లక్ష్యం ఏర్పరచు కొంటేనే పురోగతి,    ప్రతి విద్యార్థికి నిర్దేశిత లక్ష్యం అవసరమని చదువుతోపాటు వ్యక్తిత్వం కూడాఅవసరమన్నారు ప్రతి విద్యార్థి నిర్దేశితలక్ష్యం,నిర్ణయించుకున్నప్పుడే జీవితంలో రాణించగలుగుతారన్నారని,చదువులో రాణించాలంటే ఏకాగ్రత,పట్టుదల అవసరమని అందుకు అనుగుణంగావ్యాయామము,ధ్యానము, ఆసనాలుఅలవాటుచేసుకోవాలన్నారు.మాతృభాషతోపాటుఆంగ్లంలోనూపట్టుసాధించాలన్నారు.గెలుపుఓటములుసర్వసాధారణమనిప్రతిఓటమి.గెలుపునకు నాంది అని అన్నారు.సమయం చాలా విలువైనదివృధాచేసుకోకూడదన్నారు.చదువుతోపాటు వ్యక్తిత్వాన్ని తోడ్పడే ఇతర అంశాల్లో శిక్షణ పొందాలని ఆయన అన్నారు.
Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!