ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పెంచలకోన గోవులకు బొల్లినేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మేత పంపిణీ

పెంచలకోన గోవులకు బొల్లినేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మేత పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో – పసుపులేటి ఉమాశంకర్ నెల్లూరు జిల్లా పెంచలకోన గోవుల సంరక్షణకు కచ్చిరి దేవరాయపల్లి గ్రామానికి చెందిన బొల్లినేని ప్రభాకర్ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, మెట్టుకూరు కృష్ణారెడ్డి సూచనల మేరకు కచ్చిరి దేవరాయపల్లి గ్రామం నుంచి పెంచలకోన గోవుల కోసం ఒక ట్రాక్టర్ లోడ్ మేతను పంపిణీ చేశారు. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన వారందరికీ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని గోవుల సంరక్షణకు తమ వంతు సహకారం అందించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!