ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమన దేశంలో చదువు సర్టిఫికెట్లకే పరిమితమైంది

మన దేశంలో చదువు సర్టిఫికెట్లకే పరిమితమైంది

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 18 2026: మన దేశంలోని విద్యావ్యవస్థలో సర్టిఫికెట్లకు మాత్రమే కాకుండా నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఉన్నత విద్య, ప్రత్యేక నైపుణ్యాల కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. విదేశాల్లో ఒక నిర్దిష్ట సబ్జెక్ట్‌పై ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకునే అనేక అవకాశాలు ఉన్నాయని, అలాంటి అవకాశాలు మన దేశ యువతకు తగినంతగా అందుబాటులో లేవని ఆమె అన్నారు. దేశంలోని యూనివర్సిటీలు కేవలం విద్యా సర్టిఫికెట్లకే పరిమితమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు అనుగుణమైన శిక్షణ అందాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యాల లోపం కారణంగా మన దేశ విద్యార్థులు ఉద్యోగులు, వ్యాపారవేత్తలుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!