పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 07 2026: దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట పట్టణానికి చెందిన జనుంపల్లి చంద్రబాబు భార్య జనుంపల్లి మన్నెమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం స్థానిక నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మృతురాలి కుటుంబానికి రూ.5,000/- (ఐదువేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని స్థానిక నాయకులు ప్రేమ్ దానం మరియు బాలయ్య నాయుడు మృతురాలి భర్త జనుంపల్లి చంద్రబాబు కు అందజేశారు.
ఈ సందర్భంగా మృతురాలు జనుంపల్లి మన్నెమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని నాయకులు ఆకాంక్షించారు.
