ePaper
Thursday, August 6, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సు

* ఆన్లైన్ మోసలను చెక్ పెట్టేందుకు పోలీసులు చైతన్య యాత్ర

డిజిటల్ యుగంలో సైబర్ జాగ్రత్తలు తప్పనిసరి

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ జూన్ 11)

అశ్వారావుపేట పట్టణంలో సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీసులు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోలీసు అధికారులు,మాట్లాడుతూ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎవరికీ చెప్పవద్దని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల గురించి వివరించారు.

సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడం లేదా సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి అవగాహన, కార్యక్రమాలు,నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!