ePaper
Monday, June 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

జర్నలిస్టులకు సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో శనివారం జర్నలిస్టులతో జరిగిన భేటీలో సీఎం మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతోనే కేబినెట్ సబ్ కమిటీ వేశాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురండి. సబ్ కమిటీ ఒకే చోట కూర్చొని సిఫార్సులు తీసుకువస్తే, మీరు టీ తాగే లోపే మినిట్స్ రాసి కేబినెట్‌లో ఆమోదిస్తాం అని చెప్పారు.

వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధానం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని సీఎం వివరించారు.సొసైటీలపై పిటిషన్ వేయడం సాధ్యమే, కానీ ఒక్కొక్కరి పేరు మీద ఇస్తే ఎవరూ పిటిషన్ వేయలేరు. ఒక్కొక్కరి పేరు మీదే వేయాల్సి వస్తుంది. అది ఆచరణ సాధ్యం కాదు. భవిష్యత్తులో ఈ ఇళ్ల స్థలాలపై ఎలాంటి వివాదాలు రాకూడదన్నదే మా ఉద్దేశం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయంతో వారి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!