ePaper
Friday, July 31, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎన్నికల ఫలితాలపై బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్

దేశంలో మరోసారి కాకలేపిన “కమలం”

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: తెలంగాణలో వచ్చేది బిజెపి పాలన, కాలగర్భంలో కమ్యూనిస్టులు, వామపక్షాలకు దేశంలో చోటు లేదు, 100 సంవత్సరాల కమ్యూనిస్టులకు దేశ ప్రజలు చుక్కలు, దేశంలో చెక్కు చెదరని మోడీ చరిష్మా!!, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు!!

దేశంలో ఏ ఎన్నిక వచ్చిన ఫలితం బిజెపి పార్టీకి సొంతమని. ఈ విషయం దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భారతీయ జనతా పార్టీకి వరుసగా పట్టం కట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని చెప్పడంలో సందేహం లేదని వనపర్తి జిల్లాకు చెందిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ అన్నారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధిస్తూ కమ్యూనిస్టు పార్టీ కంచుకోటలో బిజెపి కమలం కాక లేపిన సంగతి గుర్తు చేశారు. ఈ దేశంలో కమ్యూనిస్టుల విధానాలు సరిపోవని, కాలం చెల్లిపోయాని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలని జ్యోతి బస్ 1977 నుండి 2000 సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా పని చేశారని ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ను పరిపాలమించిన కమ్యూనిస్టుల పాలన పట్ల వ్యతిరేకత ప్రజల్లో రావడంతో, 2011 సంవత్సరంలో TMC పార్టీ మమతా బెనర్జీ కమ్యూనిస్టు పార్టీ దురాగత పాలనను అంతం చే సి అధికారం రావడం సంతోషకరమైన విషమైన అయిన కూడా, ఆమె పాలనలో 15 సంవత్సరాలు ఆ రాష్ట్ర ము అధోగతి పాలన కావడము దురదుష్టకరము. అందుకే ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటి ఇవ్వడము జరిగింది. ఆ రాష్ట్ర ప్రజలకు బిజెపి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకు మున్నూరు రవీందర్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు ఈ దేశంలో హిందూ సమాజం చైతన్యం అయిందని హిందూ ధర్మం జాతీయవాదం బలపరుస్తుందని చెప్పడంలో సందేశం లేదని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శమని అన్నారు. తుప్పు పట్టిన ఎల్ డి ఏ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఈ దేశంలో కాలం చెల్లిందని అన్నారు. లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలకు భారతదేశంలో మరో 30 సంవత్సరాల అవకాశం లేదని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ఉగ్రవాదులను అన్సీ వేస్తూ ఈ దేశ ప్రజలను సురక్షితంగా కంటికి నిద్ర పోయే విధంగా 24 గంటలు కంటికి రెప్పలాగా కాపాడుతున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర క్యాబినెట్ మంత్రులు రక్షణ శాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తూ ఈ దేశాన్ని కాపాడుతున్న విషయం గుర్తు చేశారు. దేశ మొత్తం కాషాయమయం అయ్యిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని బిజెపి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు న్యాయవాది మున్నూరు రవీందర్ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిగా మోడీ పరిపాలన వల్ల ఈ దేశం శాంతి భద్రతలో సురక్షితంగా ఉన్న విషయం కూడా ప్రజలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు అందుకే ఈ ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ప్రజలు పట్టం కట్టినట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో చెక్కుచెదరకుండా మోడీ చరిష్మా ఈ దేశంలో నేటికీ కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలకు ప్రజలు మోసపోయిన కూడా తిరిగి రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగర వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!