*నూతన వధూవరులను ఆశీర్వధించిన కాంగ్రెస్ నాయకులు*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్
ది. 13-05-2026 బుధవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 31 వ వార్డు కి చెందిన అడ్వకేట్ దంపతులు పొన్నేకంటి నరసింహ రావు సతీమణి నవ్య తమ్ముడు అయిన చిలుకూరి రాజ్ కుమార్ వివాహం నార్విక తో వారి స్వగ్రామం అయిన కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామం లో వారి స్వగృహం నందు జరగగా ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వధించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్. ఈ కార్యక్రమం లో వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్. పి. చారీ, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు నూకల రామ్మోహన్ రెడ్డి, గుర్రం రాకేష్ రెడ్డి, కళ్లెం శేషి రెడ్డి, రాంబాబు,కొక్కు రాజు,ఏపూరి తరుణ్,జయప్రసాద్ రావు,జనార్దన్,పొన్నేకంటి నారాయణ,భద్రా చారీ తదితరులు పాల్గొన్నారు.
