ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య

మే 28

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి అజయ్ అనే 19 సంవత్సరాల యువకుడు కిడ్నీ సమస్యను భరించలేక అనారోగ్యంతో పంట కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ నిన్న రాత్రి చనిపోయాడు. మృతుడు గత తొమ్మిది నెలల నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించి మందులు వాడిన నయం కాలేదు. ఈనెల 26న కిడ్నీ సమస్యతో నొప్పి రావడంతో ఆ నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంట కొట్టే పురుల మందు తాగి తన బాబాయి అయిన లింగంపల్లి వెంకటేష్ కు విషయం చెప్పగా తాను మృతుని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నస్పూర్ గ్రామంలో ఉన్న మృతుని తల్లికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళందరూ కలిసి చికిత్స నిమిత్తం లక్షట్ పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల నుండి కరీంనగర్ ఆస్పత్రికి అక్కడి నుండి హైదరాబాద్ యశోద ఆసుపత్రి తరలించగా అక్కడ వైద్యుడు పరీక్షించి నిన్న రాత్రి చనిపోయినట్లు చెప్పారు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు మృతుని తండ్రి గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. మృతుడు అజయ్ తల్లి లింగంపల్లి సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!