ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి! : సుప్రీంకోర్టు

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ ) పరీక్ష పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.ఈ పరీక్షలో ఉత్తీర్ణత గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 పొడిగించింది జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

గతంలో తాము ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను న్యాయ స్థానం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును విద్యార్థుల విద్య వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మాత్రం మూడేళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది.

ఈ తాజా సవరణ ప్రకారం ఉపాధ్యా యులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇది వరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్‌లైన్ ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పు లోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

విద్యాహక్కు చట్టం రాకముందు నియమితులై తమ ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఉద్యోగం లో కొనసాగాలన్నా లేదా? పదోన్నతులు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.దీనిని సవాలు చేస్తూ దాదాపు 69 ఉపాధ్యా య సంఘాలు గత ఏడాది అక్టోబరు 12న సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ నెల 13న సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మా సనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చుతూ శుక్రవారం తుది తీర్పునిచ్చింది.

విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా పరీక్ష పాస్ కావడానికి తమకు తగినంత సమయం లేదని ఉపాధ్యాయులు చెప్ప డం ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది.

Latest Articles

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయం.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు తీర్పు పై సవాల్

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు...

Related Articles

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19 సెప్టెంబర్టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ డిఎస్పి సంపత్ రావు పోలీస్ స్టేషన్ రికార్డులు.పోలీస్ స్టేషన్లో .శాంతిభద్రతలపోలీసుల పనితీరు పల అంశములపై...

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి: మద్దిశెట్టి సామేలు

మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో 6 వేల మంది పూజారులతో భారీ బహిరంగ సభ పొలిటికల్ పవర్ సెప్టెంబర్,19:తెలంగాణ: గిరిజన శివశక్తుల పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మద్దిశెట్టి శామ్యూల్ ఆధ్వర్యంలో...
error: Content is protected !!