ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్ శర్మ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా నూతనంగా నియమితులైన నాయకులు బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా గాజుల కుమారస్వామి, మహబూబాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా చెవుగాని మహేష్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ సలహాదారు రాజులపాటి ఐలయ్య ఆధ్వర్యం వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా యువజన అధ్యక్షులకు మద్దిశెట్టి సామేలు అభినందనలు తెలిపారు. జిల్లాల్లో పార్టీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను ప్రజా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని నూతన అధ్యక్షులకు సూచించారు. యువతకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నూతనంగా నియమితులైన నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఊకే ఎంకన్న, కిన్నెర రామకృష్ణ, పలగాని శ్రీనివాస్ గౌడ్, సూర్య సీతారాములు, కారం చంద్రయ్య, నర్సంపేట ఇన్‌చార్జ్ మోహన్, పోతులూరి చారి, ఇస్త్రాంకుమార్, మామిళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు ప్రథమ మహాసభపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్కరపత్రాలు ఆవిష్కరించిన నాయకులుముఖ్య...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19 సెప్టెంబర్టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ డిఎస్పి సంపత్ రావు పోలీస్ స్టేషన్ రికార్డులు.పోలీస్ స్టేషన్లో .శాంతిభద్రతలపోలీసుల పనితీరు పల అంశములపై...

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి: మద్దిశెట్టి సామేలు

మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో 6 వేల మంది పూజారులతో భారీ బహిరంగ సభ పొలిటికల్ పవర్ సెప్టెంబర్,19:తెలంగాణ: గిరిజన శివశక్తుల పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మద్దిశెట్టి శామ్యూల్ ఆధ్వర్యంలో...
error: Content is protected !!