– అభినందించిన కొత్తకోట బిజెపి నాయకులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24. 2026.
మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దాబా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మంగళవారం కొత్తకోట బిజెపి పార్టీకి చెందిన నాయకులు ఆయన నివాసంలో శాలువాలు కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో నూతనముగా ఎన్నికైన మహాబూబ్ నగర్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు దాబా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధిష్టానం నాపై నమ్మకం ఉంచి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇచ్చినందుకుముందుగా పార్టీ అధిష్టానానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ఎక్కడ ఇబ్బందులు పడితే వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్. వెంకట్ రెడ్డి, అబ్బ నరేందర్ గౌడ్, కొమ్ము భరత్ భూషణ్ , వనపర్తి శ్రీనివాస్ రెడ్డి, సత్యం సాగర్,శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, స్టార్ బాలు, తదితరులు పాల్గొన్నారు.


