ePaper
Monday, September 14, 2026
📄 ePaper

మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ కలిసిన చల్లా సునీల్ కుమార్ 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్  వేముల ::– మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ బుధవారం ఉదయం పులివెందుల లోని ఆయన క్యాంప్ కార్యాలయం నందు కడప జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ 77 వ జయంతి వేడుకలు లో భాగం పులివెందుల లో 2 రోజుల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కడప జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు, ఆంధ్రప్రదేశ్ పట్రా  ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్ మాట్లాడుతూ… రాబోయే కాలంలో పట్రా కులస్తులకు వైఎస్ఆర్సీపీ పార్టీ లో సముచిత స్థానం కల్పించాలి అని, అలాగే రాబోయే కాలంలో తమ కులం ను దృష్టిలో ఉంచుకొని తమ కులస్తులకు ఎంఎల్ఏ, ఎంపీ లు గా అవకాశం కల్పించాలి అని కోరారు.అంతే కాకుండా పట్రా కులస్తులకు రాబోయే తమ ప్రభుత్వం లో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.అందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత సానుకూలం గా స్పందించినట్లు వారు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి కి వారు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.అలాగే వేముల మండలం లో పార్టీ పరిస్థితులను వివరించారు,కడప జిల్లా లో యువజన విభాగం ఆద్వర్యం లో చేస్తున్న,చేపట్టబోయే కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలిపారు.

Latest Articles

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సంస్మరణ సభ జయప్రదం చేయండి కామనురు శ్రీనివాసులురెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ​కమలాపురం: సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్...

కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి. వయో పరిమితి పెంచాలి. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్. పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ...

అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్...
error: Content is protected !!