*హాజరుకానున్న మంత్రి తుమ్మల తో పాటు ఇతర మంత్రులు…*
* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఇప్పటికే పలుమార్లు అంజనపురం ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల….*
ప్రారంభోత్సవం సందర్భంగా 1000 మంది ప్రతినిధులకు అవకాశం ఇచ్చిన ఫ్యాక్టరీ యజమాన్యం.
ఈనెల 20వ తేదీన ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైనది . వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలోని అంజనాపురం గ్రామంలో సుమారు 250 కోట్లు రూపాయల వ్యయంతో నిర్మించిన గోద్రెజ్ ప్రైవేటు పామాయిల్ ఫ్యాక్టరీ ని ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నిర్మాణపు పనులును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పలుమార్లు పరిశీలించారు. 20వ తేదీన జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోద్రెజ్ కంపెనీకి సంబంధించిన సుమారు 1000 మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నారు.
సో ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఈనెల 20వ తేదీన జరగనున్నది.


