ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ఎంపీడీఓ కార్యాలయమా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా*

📰 Generate e-Paper Clip

18 జులై 2026. ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్.

పొలిటికల్ పవర్ ములుగు జిల్లా మంగపేట మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు *కుడుముల లక్ష్మీనారాయణ*

ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు.

ప్రజా సమస్యలపై ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రజాప్రతినిధులైనా ఎంపీడీఓను నేరుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, సమస్యలను వివరించడం సహజమైన ప్రక్రియ.
అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ వ్యవస్థ తటస్థతపై సందేహాలు కలిగిస్తోంది.

మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజల ప్రతినిధులను ఆహ్వానించి పారదర్శకంగా సమావేశం నిర్వహించాలి.
ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికార యంత్రాంగం ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ సమావేశాలకు అనుమతించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో అనవసర వివాదాలకు దారితీసే అవకాశం ఉంది.

ఎంపీడీఓ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా ఉండాలి గానీ, రాజకీయ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రంగా మారకూడదు.
ప్రభుత్వ అధికారులు అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించాలి.

అదే ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమైన విధానం.
ఇకపై ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ పార్టీ సమావేశాలకు వేదికగా ఉపయోగించకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము.

“ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమే… ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు.” అని కుడుముల లక్ష్మి నారాయణ అన్నారు,

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!