– సాంకేతికత పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. అధికారులు నిర్ణత గడువులోగా పరిష్కరించాలి,
–పానగల్.మండలపరిధిలోనిఅన్నిగ్రామపంచాయతీ పరిధిలో గత రెండున్నర సంవత్సరాల కాలములోప్రజలుఆయాప్రభుత్వకార్యాలయాలకుసమర్పించినఫిర్యాదులు,పూర్తిఅయినపరిష్కారాలుఇంకాపెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల పై రాష్ట్ర అబకారి, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోఆగస్టు29.2026.ప్రజలు తమసమస్యలనురాతపూర్వకంగారాసివ్వాట్సాప్ లో పంపిన, మెయిల్ చేసిన ఆదికారులు వెంరానే స్పందించి ప్రింట్ తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదేశించారు.శుక్రవారం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగాణంలో పానగల్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండున్నరసంవత్సరాలకాలములోప్రజలుఆయా ప్రభుత్వకార్యాలయాలకుసమర్పించినతమఫిర్యాదులుఇప్పటి వరకు జరిగిన పరిష్కారాలు,ఇంకాపెండింగ్ లోఉన్నఫిర్యాదులపైరాష్ట్రఅబ్కారీ,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పానగల్ గ్రామ సభలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు నిత్యం తమ రోజువారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారని, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చి నెలల తరబడి తమ పనులువదిలిపెట్టితిరగాల్సినఅవసరం ఉండొద్దని, అధికారుల్లో మార్పు రావాలని, వచ్చిన దరఖాస్తులకుగారిష్టంగావారంరోజుల్లోపరిష్కరించాలనిఆదేశించారు.విద్యార్థులకుసంబంధించినధ్రువీకారణ పత్రాలు రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా రాసి తన చిరునామా, ఫోన్ నెంబర్ రాసి సంబంధిత శాఖధికారికి వ్వాట్సాప్ కానీ, మెయిల్,ద్వారాగానిపంపించుకోవచ్చనిసూచించారు.అనంతరం ఇప్పటివరకుపరిష్కారంకాకుండాపెండింగ్ లో ఉన్నఫిర్యాదులనుజిల్లాకలెక్టర్,ఆర్డీఓ,తహసీల్దార్, సంబంధితశాఖలఅడ్జకారులసమక్షంలోసమీక్షించారు.పెండింగ్లోఉన్నచాలాసమస్యలనుమంత్రిఅక్కడికక్కడే అధికారులద్వారాపరిష్కరించారు.రెవెన్యూసమస్యల పై ముందుగా సమీక్షనిర్వహించారు.ఫిర్యాదుదారులు తమభూసమస్యలపైఇచ్చినఫిర్యాదునుఒక్కొక్కటిగా పరిశీలించి అధికారులకు పెండింగ్ కారణాలు అడిగి పరిష్కార మార్గాలు సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల పై సమీక్షిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలోని ముడు మండలాలకు సంబంధించిఇందిరమ్మఇల్లుమంజూరు అయి ఆర్ధిక స్థోమత లేని కారణంగా ఇంకా నిర్మాణం పనులు ప్రారంభించని లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ఇవవ్వాలని, వీరందరికి తదుపరి సమీక్షా సమావేశంలో బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణంప్రారంభించేవిధంగాచూడాలనిఅధికారులను ఆదేశించారు.ఇప్పటికేఇల్లునిర్మించుకున్నలబ్ధిదారులకు నాల్గవ విడత డబ్బులు మంజూరు.విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను మంత్రి సమీక్షించారు.ఈ సమీక్షా సమావేశంలో మరికొంత మంది ప్రజలు తమ సమస్యలనురాతపూర్వకంగామంత్రికిఅందజేశారు.ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయి ప్రజల సమస్యలుఎప్పటికప్పుడుమండలస్థాయిలోనే పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ది. ఆర్. ఓ తిరుపతయ్య, తహసీల్దార్ కార్తిక్, ఎంపిడిఓ గోవిందా రావు, గ్రంధాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పానగల్ సర్పంచ్ నాగలక్ష్మి, జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


