వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం
వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్
పర్యటనకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు
అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించిన
ఆస్తుల కేసు దర్యాప్తు నేపథ్యంలో విదేశాలకు
వెళ్లేందుకు కోర్టు అనుమతి అవసరం
కావడంతో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 1 నుంచి
నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా మొత్తం 15
రోజుల పాటు యూరప్లో పర్యటించేందుకు
అనుమతి లభించింది. అయితే పర్యటనకు
ముందు పూర్తి ప్రయాణ షెడ్యూల్, బస చేసే
దేశాలు, చిరునామాలు, అత్యవసర ఫోన్
నంబర్, ఈమెయిల్ వివరాలను సీబీఐ
అధికారులకు అందించాలి. పర్యటన
ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి
కోర్టుకు హాజరై రిటర్న్ మెమో సమర్పించాలని
న్యాయస్థానం స్పష్టం చేసింది.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం