
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
బినామీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు, మిగతా కాంట్రాక్టర్లను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరింపులు
సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్కు ప్రహరీ గోడ నిర్మించే పనికి రూ.3.73 కోట్లతో టెండర్లు పిలిచిన అధికారులు
టెండర్లో ఆరు కంపెనీలు పోటీ పడగా, ఓ కంపెనీకి అర్హత లేదని తప్పించగా, మిగతా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి దరఖాస్తు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న ఓ విద్యాశాఖ ఇంజినీర్
తాను 2% తక్కువకు టెండర్ వేశానని, దరఖాస్తు వెనక్కి తీసుకోనని ఓ కాంట్రాక్టర్ తెలపగా, సదరు ఇంజినీర్ మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడిన వైనం
మంత్రి సూచన మేరకు పోటీ నుండి తప్పుకుంటున్నట్టు లేఖ ఇవ్వాలని, ఆఫీసుకు వస్తే వివరాలు చెప్తానని తెలిపిన ఇంజినీర్
అయితే టెండర్ వేసిన సంస్థల్లో ఓ సంస్థ సదరు ఇంజినీర్కు బినామీ కంపెనీ అని, ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించేందుకే మిగతా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడని సమాచారం
