స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
పరకాల పోలీస్ స్టేషన్ నుంచి బీజేపీ నాయకులను పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఇప్పుడు పరకాల పోలీస్ స్టేషన్ నుంచి వేరే ప్రాంతానికి తరలించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం నేరమా?. ప్రతిపక్ష నాయకులను అణచివేయడం కాదు… ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి!. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వెంటనే నిలిపివేయాలి.
