ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారంలో నాణ్యతా లోపం.. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైనం..

📰 Generate e-Paper Clip

  1. *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి

    * గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఇస్తున్న కోడిగుడ్లు నాసిరకం.

  2.  * చిన్న సైజులో, కుళ్ళిన వాసన వస్తున్న గుడ్లు.
  3.  * అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ల అడ్డగోలు తతంగం.
  4.  * ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు, తల్లిదండ్రులు
  5. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, మరియు లేత వయస్సు గల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సరఫరా  చేస్తున్న కోడిగుడ్లు తీవ్ర నాసిరకంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయ  క్షేత్రస్థాయిలో అనేక అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని గుడ్లు సాధారణ పరిమాణం కంటే చాలా చిన్నవిగా ఉండగా, మరికొన్ని కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నాయి. పౌష్టికాహారం ద్వారా అందాల్సిన పోషకాలు అటుంచితే, ఈ నాసిరకం గుడ్లను తింటే పిల్లలు, బాలింతలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల ఉదాసీనతపై విమర్శలు: నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు నాణ్యమైన, నిర్దేశిత బరువు కలిగిన తాజా గుడ్లను మాత్రమే అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేయాలి. అయితే, క్షేత్రస్థాయిలో అధికారులు సరైన పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేంద్రాలకు చేరిన గుడ్లలో పది నుంచి ఇరవై శాతం వరకు పగిలిపోవడం లేదా పాడైపోవడం జరుగుతున్నట్లు సమాచారం ప్రజల, నిపుణుల డిమాండ్:చిన్నారులు మరియు బాలింతల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సంబంధిత కాంట్రాక్టర్లపై మరియు ఈ విషయాలను పట్టించుకోని అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పకడ్బందీ తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest Articles

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్

జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి...

గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో...

డీజే వలన ఆనందం డిజే వలన ఆరోగ్యం ప్రమాదం

డి జె ఇదో కొత్త మాయదారి రోగం.ముందు దీనివల్ల...

ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్యపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి 

–పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు...

Related Articles

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.ప్రజలేతనబలంగా ప్రజాసేవయేతనలక్ష్యంగాపెట్టుకునిఅభివృద్ధినితనధ్యేయంగామార్చుకునిదేవరకద్రనియోజకవర్గంలోగర్వించేనాయకునిగాముందుకెళ్లడంఅభినందనీయమనిశ్రీశ్రీకురుమూర్తిదేవస్థానంమాజీడైరెక్టర్.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్, కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఎమ్మెల్యే...

పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్

జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.రికార్డు అసిస్టెంట్‌గా విధులు...

గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్ .16.2026.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా...
error: Content is protected !!