అనారోగ్యంతో మృతి చెందిన పాస్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు
పొలిటికల్ పవర్ దినపత్రిక/ పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్లో స్థానికంగా నివాసం ఉంటున్న చర్చి పాస్టర్ ఏసురత్నం ఈ రోజు ఉదయం అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దోమ ఆనంద్, సొసైటీ అధ్యక్షుడు చల్లగుళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


