ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: వనపర్తి మండలం చిట్యాలలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWR) బాలుర జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ G.O.Rt.No.93, తేదీ 16-07-2026 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వనపర్తి నియోజకవర్గంలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న MJPTBCWR బాలుర పాఠశాల ప్రాంగణంలోని స్థలంలో నూతన జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. భవన నిర్మాణ పనులను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) ద్వారా చేపట్టేందుకు 05-09-2026న ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యను మరింత సౌకర్యవంతంగా అభ్యసించే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ వసతులు విద్యార్థులను ఉన్నత విద్య వైపు మరింత ప్రోత్సహిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి లకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

