– భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి,
– జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జేయం. మీ షేక్,
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 15.2026.
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జేయం. మీషేక్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వందేమాతరం, మహనీయులకు నివాళులు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాని నిర్వహించారు.జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులుజేయం.మీషేక్,మాట్లాడుతూభారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి వల్లేమనకుస్వతంత్రoవచ్చిందని,మనమందరం వారిని స్మరించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు యం. కిషన్ నాయక్,యస్.ఈశ్వర్,
ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి గంగాధర్, ప్రచార కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు వీర నరసింహ చారి, కృష్ణ య్య గౌడ్,మధు రత్న,సుల్తాన్, భాస్కర్, విజయలక్ష్మి ప్రసన్న కుమార్,బల్ రాజ్, లక్ష్మయ్య బాబాయ్,కురుమన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

