ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంతెలంగాణలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు: పొదిలి రవికుమార్

తెలంగాణలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు: పొదిలి రవికుమార్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక& పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ రావూరి నాగేశ్వరావు మే 20 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ముప్పుతప్పదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిలి రవికుమార్ హెచ్చరించారు. ఖమ్మంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపులకు సరైన స్థాయిలో పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి న్యాయం చేయాలని, మున్నూరు కాపులకు తగిన గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు పొదిలి రవికుమార్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, గౌరవ అధ్యక్షులు కొత్త సీతారాములు, ప్రధాన కార్యదర్శి పసుల్లేటి దేవేంద్రం, కోశాధికారి మడూరి పూర్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!