ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి ‘రైతుభరోసా’ నిధులు రిలీజ్‌!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం గురువారం అధికారికంగా మార్గదర్శకాలను (గైడలైన్స్) విడుదల చేసింది. ఈ పథకం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున, రెండు సీజన్లలో కలిపి మొత్తం రూ. 12 వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ వానాకాలం సీజన్‌లో రైతుభరోసా లబ్ధి పొందడానికి ప్రభుత్వం కీలక విధివిధానాలను ఖరారు చేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి ‘భూభారతి’ పోర్టల్‌లో భూమి వివరాలు నమోదై, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సీ సీ యల్ ఏ) నుంచి అనుమతులు పొందిన రైతులకు మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (ఆర్ ఓ ఎఫ్ ఆర్) పట్టాలు కలిగిన గిరిజన రైతులు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొంది ఉండాలి. అర్హులైన రైతుల రికార్డులను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఒక జిల్లా పరిధిలోనే దాదాపు 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా, వారి కోసం రూ. 460 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది రైతులు కూడా ఉన్నారు. మరోవైపు, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను సిద్ధం చేశామని, మొబైల్ యాప్‌లో బుక్ చేసుకున్న వెంటనే రైతులకు యూరియా అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే, త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు వాటికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు.

Latest Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

 – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!