ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరాజనగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రాజనగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

– ఉట్టి కొట్టిన ప్రణవ్ తేజకు శాలువాతో సన్మానం.. రూ.2 వేల నగదు బహుమతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: నపర్తి పట్టణంలోని రాజనగరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజనగరం నుంచి బ్రాహ్మణ వీధి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా చేరుకొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉట్టి కొట్టే పోటీలో ప్రణవ్ తేజ విజయవంతంగా ఉట్టి కొట్టడంతో నిర్వాహకులు, గ్రామ పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే రూ.2,000 నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు,ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు యువతలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజనగరం, బ్రాహ్మణ వీధి పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!