సత్తుపల్లి ఏరియాలో 4వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు.
పీఆర్పీ బకాయిల విడుదల, పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్.
స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక.
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎస్సీసీఎల్ ఏరియాలో సింగరేణి అధికారుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – ఎస్ సి సి ఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో (గురువారం) విజయవంతంగా 4వ రోజుకు చేరుకున్నాయి.
దీక్షా శిబిరంలో కూర్చున్న అధికారులకు తోటి ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
పీఆర్పీ బకాయిలు: నిలిచిపోయిన పీఆర్పీ బకాయిలనుతక్షణమే విడుదల చేయాలి, పే అప్గ్రేడేషన్: అధికారుల సుదీర్ఘకాల సమస్య అయిన పే అప్గ్రేడేషన్ను వెంటనే అమలు చేయాలి. ఈ రిలే నిరాహార దీక్షలు జూలై 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని, యాజమాన్యం సానుకూలంగా స్పందించని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు హెచ్చరించారు.
