బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ ప్లాజా వద్ద నిరసన
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక మే 12 2026: హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ ప్లాజా వద్ద పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ… బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని, కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శక విచారణ జరపాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొని నినాదాలు చేశారు.
