పదేళ్లకు ఒక్కసారి పూసే అరుదైన పుష్పం.. బాపట్లలో చూసేందుకు క్యూ!

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్
బాపట్ల పట్టణంలోని ఆంధ్రకేసరి నగర్లో విశ్రాంత ఏడీ పోకల వెంకటేశ్వరరావు ఇంటి పెరట్లో అరుదైన భారీ కంద జాతి పుష్పం పూసి ఆకట్టుకుంటోంది. బెంగళూరులో కొనుగోలు చేసిన కందను ఇంటి వద్ద నాటగా, ఇటీవల భారీ ఆకారంలో పువ్వు విరబూసింది.
ఏనుగు పాదాన్ని పోలి ఉండే ఈ పుష్పాన్ని శాస్త్రీయంగా ‘ఎలిఫెంట్ ఫుట్ యామ్’గా పిలుస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు. పదేళ్లకు ఒక్కసారి మాత్రమే మే, జూన్ నెలల్లో ఈ పుష్పం పూస్తుందని, దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
