ప్రేమ’ వారధి.. తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్

పొలిటికల్ పవర్ న్యూస్ PN9 తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తెలంగాణ రాష్ట్రంలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సిద్ధమవుతోంది.కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీన్ని రూపొందిస్తున్నారు. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొన్నారు. తొలి గ్లాస్ బ్రిడ్జి కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి ప్రజలు విచ్చేస్తున్నారు.
