ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

_పింఛన్ ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పింఛన్లు ఇవ్వాలని అన్నారు._

 

_ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అని తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని పేర్కొన్నారు._

 

_రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు ప్రతి నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని ఆదేశించారు._

 

_అలాగే పెన్షన్ల పంపిణీ విధానంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, SEEEPC సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.._

Latest Articles

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులుసెప్టెంబర్ 19...

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!