ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఎపెక్స్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో అరుదైన కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కె .కిషోర్ కుమార్...

ఎపెక్స్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో అరుదైన కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కె .కిషోర్ కుమార్ రెడ్డి ( ఎం ఎస్ ఎం సి హెచ్ )ప్రముఖ యూరాలాజిస్ట్

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ నైన్ టివి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి


ఖమ్మం నగరం లోని నరసింహ స్వామి టెంపుల్ రోడ్, బాలాజీ నగర్ ఎపెక్స్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కి వైద్యం కోసం శ్రీ మతి మైలవరపు విజ్జేశ్వరి, వయసు :30 సం,, మహిళ W/O మురళి జీలూగు మిళ్లు గ్రామము జీలూగు మిళ్లు మండలం, ఏలూరి జిల్లా. తేదీ: 10-07-2026 గురువారం రోజున డాక్టర్ కె .కిషోర్ కుమార్ రెడ్డి ని సంప్రదించగా పరీక్షలు నిర్వహించి, వారికీ అరుదైన కిడ్నీ జబ్బు ఉన్నది అని కిడ్నీలో రాయి కూడా ఉన్నది అని తెలుపగా వారు డాక్టర్ సలహా మేరకు హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు.11వ తేదీన వారికీ శస్త్ర చికిత్స(ఆపరేషన్) చేసి కిడ్నీ లో ఉన్న రాయిని (సుమారు 800 గ్రాముల) తీసినారు. వారు గత 8-10 సం,,రాలుగా మందులు వాడుతున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయినది. పేషెంట్ రికవరీ అవుతుంది . ఈ కార్యక్రమంలో డాక్టర్ ముకుంద బర్మా (న్యూరాలోజిస్ట్ డాక్టర్ ఆర్. లలిత (గైనాకాలోజిస్ట్ ) డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి (గ్యాస్ట్రో ఎంట్రోలాజిస్ట్ ) డాక్టర్ రాకేష్ (జనరల్ ఫీసిశియన్ ) డాక్టర్ శివ రామ్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్ ) ఎపెక్స్ హాస్పిటల్ మేనేజర్ కోరిపల్లి శ్రీనివాస్ మరియు హాస్పటల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!