-డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ 13 జులై 2026: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ఆర్ అని *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాల్వంచలోని కేఎల్ఆర్ విద్యాసంస్థల అధిపతి దివంగత డాక్టర్ లక్ష్మారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కెఎన్ఆర్ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… కేఎల్ఆర్ విద్యాసంస్థల పేరుతొ వేలాది మందికి విద్యను చెప్పించిన వ్యక్తి కెఎన్ఆర్ అని కొనియాడారు. కేఎల్ఆర్ సతీమణి నాగమణి, కుమారుడు సిద్దార్థరెడ్డి, కుమార్తె సింధు, కుటుంబసభ్యులు శంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి లను కలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ కాల్వ భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, వెంకటేశ్వర్లు, బండి లక్ష్మణ్, గజ్జి శ్రీను, దండోరా శ్రీను, కొత్తపల్లి సోమయ్య, భావ్ సింగ్, బి ఆర్ ఎస్ నాయకులు కాల్వ ప్రకాశరావు, పరంధామరెడ్డి, జర్నలిస్టులు సంజీవ్, చండ్ర నర్సింహారావు, ఆర్ కృష్ణ మూర్తి, వెంకట రెడ్డి, వేలదండి ప్రసాద్*, తదితరులు పాల్గొన్నారు.
