పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 20: చెన్నై / తమిళనాడు:తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి – ఎన్వైసీ జాతీయ నాయకులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీ తమిళనాడు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలోపేతం, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని, ఎన్వైసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
తమిళనాడులో టీవీకే పార్టీకి యువతలో ఉన్న ఆదరణ, ఎన్డీఏ కూటమి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ మహాకూటమి మరింత బలంగా ముందుకు సాగేందుకు ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉపయోగపడతాయని ఇరువురు ఆకాంక్షించారు.
ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని మద్దిశెట్టి సామేలు తెలిపారు.

