ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం తిరుమల మహేష్– 27 మంది ఆడబిడ్డల వివాహ వేడుకలకు పుస్తె-మెట్టెల కానుకలు,

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026. సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సాగుతున్న టి.ఎస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేష్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. కులమతాలకు అతీతంగా, పేదరికాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఆపదలో ఉన్న ప్రతి ఇంటికి అండగా నిలవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన ఇప్పటివరకు అన్ని వర్గాలకు చెందిన సుమారు 27 మంది ఆడబిడ్డల వివాహ వేడుకలకు మంగళప్రదమైన ‘పుస్తె’ (బంగారు తాళిబొట్టు) ‘వెండి మెట్టెలను’ కానుకగా అందజేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. నాగవరం గ్రామానికి చెందిన పసుపుల ఆనంద్ – సుజాత దంపతుల కుమార్తె, నాయి బ్రాహ్మణ ఆడబిడ్డ అపూర్వ వివాహ మహోత్సవానికి ఈ మంగళప్రదమైన కానుకను అందజేసి ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. ఏ కష్టం వచ్చినానేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే మహేష్ సేవా దృక్పథం ఎందరికో ఆదర్శంమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అశ్విని చంద్రకుమార్ మాట్లాడుతూ తిరుమల మహేష్ కులమతాలకు తావు లేకుండా నిరుపేద కుటుంబాలకు ఒక ఆశీర్వాదం వంటి వారు. ఇప్పటికే 27 మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు అందజేసి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన మహేష్ మహోన్నత వ్యక్తిత్వానికి హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అశ్విని చంద్రకుమార్, జిల్లా అధ్యక్షులు అశ్విని రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు మాందాపూర్ కృష్ణయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

Related Articles

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో...

రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి హైదరాబాద్ ట్యాంక్...

అన్నదాతలకు అధైర్యం వద్దు,  చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం, పెబ్బేరు, శ్రీరంగాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!