ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఫీజు చెల్లించలేదని విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం:

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి

విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదనే సాకుతో వారి అసలు విద్యా ధృవీకరణ పత్రాలను (ఒరిజినల్ సర్టిఫికెట్స్ ) విద్యా సంస్థలు తమ వద్దే ఉంచుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

 

ఒక విద్యార్థి ఫీజు బకాయి పడ్డాడనే కారణంతో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం అతని ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై సదరు విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

 

విద్యా సంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను కేవలం పరిశీలన (వెరిఫికేషన్ ) కోసం మాత్రమే తీసుకోవాలని, బకాయిల కోసం వాటిని తాకట్టు పెట్టుకునే (లైన్ ) హక్కు విద్యా సంస్థలకు లేదని కోర్టు తేల్చి చెప్పింది.

 

విద్యా ధృవీకరణ పత్రాలు అనేవి విద్యార్థి మేధస్సుకు, చదువుకు సంబంధించినవని, వాటిని ఆర్థిక లావాదేవీల కోసం వాడుకోవడం చెల్లదని ధర్మాసనం పేర్కొంది.

 

ఒకవేళ విద్యార్థులు ఫీజు చెల్లించకపోతే, ఆ బకాయిలను వసూలు చేసుకోవడానికి చట్టపరమైన ఇతర మార్గాలను (సివిల్ కోర్టుల ద్వారా) అనుసరించాలే తప్ప, వారి భవిష్యత్తును దెబ్బతీసేలా సర్టిఫికెట్లను ఆపకూడదని హెచ్చరించింది.

 

పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థికి సంబంధించిన సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సదరు విద్యా సంస్థను కోర్టు ఆదేశించింది.

 

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఫీజుల పేరుతో సర్టిఫికెట్లను బ్లాక్ మెయిల్ అస్త్రంగా వాడుకుంటున్న తరుణంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

 

భార్య తన భర్త ఆదాయపు పన్ను వివరాలను RTI కింద పొందలేరు:

 

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

 

భార్యాభర్తల మధ్య నడుస్తున్న మెయింటెనెన్స్ కేసుల విచారణలో ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

 

మెయింటెనెన్స్ క్లెయిమ్ (జీవనభృతి) కోసం భార్య తన భర్త యొక్క ఆదాయపు పన్ను వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ యాక్ట్ ) కింద పొందేందుకు వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి యొక్క ఆదాయపు పన్ను రిటర్నులు (ఐ టి ఆర్ ఎస్ ) అనేవి పూర్తిగా వారి “వ్యక్తిగత సమాచారం” (పర్సనల్ ఇన్ఫర్మేషన్ ) పరిధిలోకి వస్తాయని, కాబట్టి వాటిని బహిర్గతం చేయలేమని న్యాయస్థానం తెలిపింది.

 

ఒక వివాహ వివాదంలో భార్య తన భర్త నుండి మెయింటెనెన్స్ పొందేందుకు, అతని ఆర్థిక స్థితిని నిరూపించాలనే ఉద్దేశంతో ఆర్ టి ఐ ద్వారా భర్త ఆదాయపు పన్ను వివరాలను కోరింది. దీనిపై గతంలో స్పందించిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి ఐ సి ), సదరు భర్త యొక్క నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలను భార్యకు అందజేయాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.

 

ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

 

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం, సిసి ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది:

 

సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 8(1)(j) ప్రకారం.. విస్తృతమైన ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని లేదా వారి గోప్యతకు భంగం కలిగించే వివరాలను వెల్లడించకూడదు. ఆదాయపు పన్ను రిటర్నులు పూర్తిగా వ్యక్తిగత సమాచారమే.

 

భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగత లేదా వైవాహిక వివాదాలలో భర్త ఆదాయ వివరాలు కోరడం వెనుక ఎలాంటి ‘విస్తృత ప్రజా ప్రయోజనం’ (లార్జర్ పబ్లిక్ ఇంటరెస్ట్ ) దాగి లేదు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్థలలో పారదర్శకత కోసం తీసుకొచ్చారే తప్ప, వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి కాదని కోర్టు స్పష్టం చేసింది.

 

మెయింటెనెన్స్ కేసులలో భర్త ఆదాయ వివరాలను తెలుసుకోవడానికి భార్యకు ఇతర చట్టపరమైన మార్గాలు ఉన్నాయని కోర్టు గుర్తుచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. మెయింటెనెన్స్ కేసులలో ఇరు పక్షాలు తమ ఆస్తులు, అప్పులు మరియు ఆదాయ వివరాలతో కూడిన అఫిడవిట్లను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆయా కోర్టుల ద్వారానే చట్టబద్ధంగా వివరాలు పొందాలే తప్ప, ఆర్ టి ఐ ని ఒక షార్ట్‌కట్‌లా వాడకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు ద్వారా వైవాహిక వివాదాల్లో ఆర్ టి ఐ చట్టాన్ని ఉపయోగించి భర్తల ఆర్థిక వివరాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు సేకరించే ధోరణికి అడ్డుకట్ట పడినట్లయింది.

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి◆ రూ. 900 కోట్ల గురుకుల విద్యాలయాల అక్రమాలపై...

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!