కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్ 9 సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని
కలసపాడు మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, గోడి. వినోద్ కుమార్ రెడ్డి, పావనిల కుమార్తె హసీని జన్మదిన సందర్భంగా శనివారం అమగంపల్లె పల్లె సిద్దయ్య గారి మఠం వద్ద ఉన్న బాలమ్మ సత్రం వృద్ధాశ్రమం నందు, మరియు కాశి నాయన మండలం వివేకానంద ఆశ్రమం వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా మా కుటుంబం లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వృద్ధా ఆశ్రమముల నిర్వాహకులు చేస్తున్న సేవలను బలపరిచేందుకు ఈ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటామని తెలిపారు. ఈ విధంగా నిర్వహించే వారికి మనమే అండగా ఉండాలని మానవత్వ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోడి .వినోద్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ మానవతా దృష్టి తో తమ కుటుంబాల లో జరుపు కుంటున్న కార్యక్రమాలను. అనాధ పిల్లలకు, వృద్ధులకు, అన్నదాన, వస్త్ర దానం ,చేయడం వల్ల మన సమాజం లో మానవతా విలువలు పెంచుకొని సమసమాజ స్థాపనకు చేయూత ఇచ్చిన వారం అవుతామని గోడి. వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు ఈకార్యక్రమంలో పలువురు నాయకులు బంధువులు స్నేహితులు పాల్గొన్నారు.
