జులై 10 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా.
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ అంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్న, బి. కోడూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరదరాజులు సతీమణి కె. వసంతకుమారి జన్మదిన వేడుకలను స్థానిక సెయింట్ ఆంటోనీ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు కుమారులు డాక్టర్. సత్యదేవ్, డాక్టర్. కళ్యాణ్, కోడలు డాక్టర్ , షైనీ పాల్ అందరు కలసి సంతోషంతో జన్మదిన వేడుకలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ , రాజశేఖర్ రెడ్డి, మరియు ప్రిన్సిపల్ చిత్త, ప్రభావతమ్మ లు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను చూసే విషయంలో చాలా ఓర్పు, వినయం, సహనం, క్రమశిక్షణ, పట్టుదల కలిగిన అధ్యాపకురాలు అని తెలిపారు. చెప్పిన పనిని తూ.చా తప్పకుండా చేసేవారని వారు అన్నారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆత్మీయ భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు అందించారు. విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
