ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

📰 Generate e-Paper Clip

 

వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి అస్తవ్యస్తంగా కొనసాగుతున్న విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ బుధవారం వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతిరెడ్డి మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఇందిరమ్మ పాలనలో విద్యుత్ సరఫరాకు వేళాపాళా లేకుండా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 7–8 గంటల మేర మాత్రమే విద్యుత్ అందుతోందని అన్నారు. సమయ సందర్భం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో పంటలకు నీరందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతలపై రాష్ట్రంలోని పలుచోట్ల రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, కనీసం వ్యవసాయ అవసరాలకు అవసరమైన విద్యుత్‌ను నిర్దిష్ట సమయాల్లో అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రఘుపతిరెడ్డి తెలిపారు. రైతులు కోరుతున్న 24 గంటల విద్యుత్ సరఫరా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొని విద్యుత్ కోతలపై నిరసన వ్యక్తం చేశారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

Related Articles

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: వినాయక చవితి పవిత్ర పండుగను పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఆధ్యాత్మిక శోభతో పోలీసు సురక్ష గణనాథుని నిమజ్జనం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి 

  – సంప్రదాయబద్ధంగా పోలీసు సురక్ష గణపయ్య లడ్డూ వేలం పాట పెద్ద లడ్డు 61. వేలకు చిన్న లడ్డు 21.వేలం పాట,– భక్తి సంస్కృతి, సంప్రదాయాల నడుమ పోలీసు...
error: Content is protected !!