
//పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకము (NSS) కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్, విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మానవాళి మనగడకు మొక్కలే ఆధారం కాబట్టి అమ్మ జన్మనిస్తే చెట్టు పునర్జన్మణిస్తుంది ప్రస్తుత వాతావరణ కాలుష్య పరిస్థితి దృశ్య ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ మీ నివాస ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో అందరూ మొక్కలు నాటడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారు అవుతారు కాబట్టి అందరు కూడా మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేలాగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్,ఓదెలు కుమార్, గణేష్,రాజేందర్,రవీందర్ మరియు NSS విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

