పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ రిపోర్టర్. ఏం. ప్రసాదరావు. కడప జిల్లా కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు రక్షాబంధన్ కార్యక్రమాన్ని పాఠశాలలో ఉన్న అన్న చెల్లెల అందరిని కలిపి కరస్పాండెంట్ చిత్త. రాజశేఖర్ రెడ్డి ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి మాట్లాడుతూ అక్క చెల్లెలు ప్రేమానురాగాలకు ,అన్నా తమ్ముళ్ల ఆప్యాయతకు నిదర్శనమని ,ఈ రక్షాబంధన్ తెలియజేస్తుంది. అందుకే ఈ రోజున ఎక్కడెక్కడ ఉన్న అన్నా చెల్లెలు అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుకొని ఒకరికొకరు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇలాంటి అన్నయ్యలు నిరంతరం అక్క చెల్లెళ్లకు తోడుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చిన్నారి అన్నా చెల్లెలు పాల్గొన్నారు.
