ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన లో ప్రజలకు...

ఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన లో ప్రజలకు చేసింది ఏమిటీ

📰 Generate e-Paper Clip


–వెయ్యిరోజులైనాహామీలఅమలులేదు,ప్రజల్నిమోసంచేసివెయ్యిరోజులసoబరాలుచేసుకుంటున్నారు,ఆరుగ్యారెంటీలు,420హామీలగురించి ప్రజలు తిరగబడేరోజులు వస్తాయి,

– దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్
సెప్టెంబర్.06.2026.వెయ్యిరోజులైనాహామీలఅమలులేదు,ప్రజల్నిమోసంచేసివెయ్యిరోజులసంబరలుచేసుకుంటున్నారు,ఆరుగ్యారెంటీలు,420హామీలగురించి ప్రజలుతిరగబడేరోజులువస్తాయని,దేవరకద్రమాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం
వనపర్తి జిల్లాదేవరకద్రనియోజకవర్గంలోనికొత్తకోట పట్టణంలో కాంగ్రెస్ వెయ్యి రోజులపాలననునిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ  విద్యార్థులకు ఇచ్చిన  హామీలు గుర్తు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ హామీలు అమలు చేయాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ,అనంతరం నిర్వహించి పట్టణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూవెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో ప్రజలు ఎవరూ సంతోషం గా లేరని అన్ని రంగాలప్రజలను తీవ్రం గా మోసం చేసిందని అన్నారు .అనాడుబిఆర్ఎస్,ప్రభుత్వపాలనలోప్రవేశపెట్టినసంక్షేమపథకాలనుఇప్పటిప్రభుత్వంతుంగలోతొక్కి,వొక్కో సంక్షేమ పథకాన్ని తూట్లు పొడుస్తూ ముందుకు వెళ్తావుందని, ఎన్నికల ముందు మాప్రభుత్వంవొచ్చిన వంద రోజుల్లోనే ఆరుగ్యారెంటీలనుఅమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలోఅమలుచేయడంలోపూర్తిగావిఫలమైందని అన్నారు.  ముఖ్యంగా రైతులకు ఇస్తా అన్న రెండులక్షలరుణమాఫీపూర్తిస్థాయిలోఇవ్వలేదు.ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి అరకొర గా ఇచ్చి చేతులుదులుపు కుంటుంది.ధాన్యానికి క్వింటాల్ కుఅయిదువందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అయిదు రకాల వెరైటీలకుమాత్రమేఇస్తున్నారని,యూరియా డిఏపి ఎరువులు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడురైతుభీమాపథకాన్నికూడానిలిపివేసేప్రయత్నం చేస్తున్నారని రైతు భీమాపథకాన్నికొనసాగేవిధం గా చర్యలు తీసుకోవాలనిఈసందర్భంగాప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే మహిళలకు ఇస్తామన్న 2500.రూపాయలు 500 రూపాయల కి సిలిండర్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లక్ష రూపాయలు తో పాటుతులంబంగారంఏమైందనిప్రభుత్వాన్నిప్రశ్నించారు.ప్రజలుకాంగ్రెస్,పైఆగ్రహంగాఉన్నారని,అనడానికి ఇదే నిదర్శనంమని,నిరుద్యోగులకు   రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, స్కూటీలు, ఐదు లక్షల భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని,విద్యార్థులకు ఇచ్చిన హామీలుఎప్పుడుఅమలుచేస్తారనిరోడ్లమీదకువచ్చారని,విద్యార్థులపక్షానబీఆర్ఎస్,నిరసనకార్యక్రమాలుచేపట్టిందని,హామీలుఅమలుచేసేవరకుకాంగ్రెస్,నునిద్రపోనివ్వమని,ప్రజల పక్షాన ఆందోళనలు మరింత ఉధృతంచేస్తామనిఆయనఅన్నారు.ఈకార్యక్రమంలో
మాజీ వనపర్తి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ జీ. వామన్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పి. విశ్వేశ్వర్,మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్,ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్,కౌన్సిలర్లు ఎరుకలితిరుపతయ్య,అయ్యన్న,ముంత మంజుల రామకృష్ణ, అడ్వకేట్ యాదగిరి, రవీందర్ రెడ్డి, సత్యమ్ యాదవ్, సాదిక్ అలీ, అస్కని శ్రీను, యుగంధర్ రెడ్డి,పసుపుల నెహ్రు, గోపాల్ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!