గంగారం ప్రకాష్నగర్ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్ 9 తెలుగు న్యూస్ , సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాసరి మధు మోహన్ రెడ్డి ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. శనివారం (27-06-2026) గంగారం గ్రామంలోని ప్రకాష్నగర్ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ కాకర్ల రేవతి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో గ్రామ ప్రజలకు వివరించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా సహకరించాలని కోరారు.


