ePaper
Monday, September 14, 2026
📄 ePaper

రైతులకు మరింత చేరువగా సహకార బ్యాంకింగ్ : మంత్రులు పొంగులేటి, తుమ్మల

📰 Generate e-Paper Clip

– కరుణగిరి, చెరువు మాదారం నూతన డీసీసీబీ శాఖల ప్రారంభం

– రూ. 20 వేల కోట్ల రుణమాఫీతో రైతులకు అండగా నిలిచాం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిది ​ఖమ్మం: రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కరుణగిరి డిసిసిబి బ్రాంచిని వరంగల్ క్రాస్ రోడ్డులో, నేలకొండపల్లి మండలం చెరువు మాదారం డిసిసిబి బ్రాంచిని చెరువు మాదారం గ్రామంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సీపీ సునీల్ దత్‌లతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…ప్రైవేట్, కమర్షియల్ బ్యాంకులతో పోటీగా డీసీసీబీ శాఖలు ఆధునిక ఆర్థిక సేవలు అందిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం డీసీసీబీ రూ. 5 కోట్ల లాభాలను ఆర్జించిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ధర్నాలు విడ్డూరం

  రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు బీఆర్‌ఎస్‌ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డిపొలిటికల్ పవర్...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!